హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన షట్లర్ కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ నంబర్ 1 ర్యాంకు సాధించిన సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. మన దేశానికి చెందిన ప్రకాష్ పదుకునే తరువాత ఆ స్థానాన్ని కైవసం చేసుకున్న క్రీడాకారుడు శ్రీకాంత్ కావడం హర్షణీయమన్నారు. తెలుగు ప్రజలందరూ గర్విస్తున్నారని, శ్రీకాంత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.