కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
విజయమ్మను కలిసిన శోభారాణి
08 Nov 2012 11:41 AM
తుని:
తూర్పు గోదావరి జిల్లా తుని పురపాలక సంఘం మాజీ అధ్యక్షురాలు కుసుమంచి శోభారాణి, తన భర్త సత్యనారాయణతో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వై.యస్. విజయమ్మను కలుసుకున్నారు. తుపాను బాధితులను పరామర్ఙంచేందుకు వచ్చిన విజయమ్మను వారు సాయినగర్లోని దాడిశెట్టి రాజా నివాసంలో బుధవారం ఉదయం కలిశారు. పార్టీకి సంఘీభావం ప్రకటించారు. తమకు మహానేత వై.యస్. రాజశేఖరరెడ్డి అంటే ఎనలేని అభిమానమని పేర్కొన్నారు. తొలిసారిగా తుని వచ్చిన విజయమ్మను మర్యాదపూర్వకంగా కలుసుకున్నట్టు వారు తెలిపారు. త్వరలో తాము వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు వెల్లడించారు. శోభారాణి దంపతులను పార్టీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్ర బోస్, కొణతాల రామకృష్ణ, కుడుపూడి చిట్టబ్బాయి, ఇతర నాయకులకు దాడిశెట్టి రాజా పరిచయం చేశారు.