బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ప్రజలకు మరింతగా సేవలు
28 Jun 2016 3:00 PM
న్యూఢిల్లీ: వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి రాజ్యసభ ఎంపీ గా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి ద్వైవార్షిక ఎన్నికల్లో భాగంగా విజయసాయిరెడ్డి ఎన్నికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి.
అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ పదవిని తాను అలంకార ప్రాయంగా భావించటం లేదని స్పష్టం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి రాష్ట్రాభివృద్ధికి తన వంతుగా పాటు పడతానని ఆయన అన్నారు. వైయస్సార్సీపీ నుంచి తానే మొదటి రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కావటం సంతోషంగా ఉందని అభిప్రాయ పడ్డారు. ఇందుకు గాను పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.