వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వీధిలైట్ల కింద చదువులు: వైయస్ఆర్సిపి నిరసన
28 Jan 2013 6:19 PM
నెల్లూరు : విద్యుత్ చార్జీల పెంపునకు అధికార పార్టీ నాయకులు, మంత్రులే బాధ్యత వహించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోటంరెడ్డి శ్రీధరరెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ ఆదివారం రాత్రి వైయస్ఆర్సిపి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. నెల్లూరులోని కె.వి.ఆర్ పెట్రోలు బంకు సెంటరులో విద్యార్థులు వీధిలైట్ల కింద చదువుకుని, హోంవర్కు పూర్తిచేశారు.
ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ, కరెంటు చార్జీల భారంతో విద్యార్థులు వీధిదీపాల కింద చదువుకుంటున్నారన్నారు. సర్చార్జీల భారం మోపి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం చేసే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ ప్రజాస్వామాన్ని ఖూనీచేస్తూ సహకార ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతోందని ఆరోపించారు. విద్యుత్ చార్జీలను వ్యతిరేకిస్తూ మంత్రులు, నాయకులను నిలదీస్తామని కోటంరెడ్డి హెచ్చరించారు.