కుట్రలు పన్నడం, తప్పించుకోవడం బాబు నైజం

హైదరాబాద్ః విదేశాలకు ఈమెయిల్ లు పంపుతున్నారని మాట్లాడడం...నిరూపించమంటే జారుకోవడం టీడీపీకి బాగా అలవాటైపోయిందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. కుట్రలు పన్నడం, తప్పించుకోవడం చంద్రబాబు నైజమని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఇష్టానుసారం పరిపాలన సాగిస్తూ, అంతర్జాతీయ వేదికలపై చంద్రబాబు ఏపీ పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top