ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
వరద మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి
07 Nov 2012 9:28 AM
తుని:
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన తుని పర్యటనలో బాధితుల కోసం ఒక్క గంట కూడా కేటాయించలేకపోయారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో బుధవారం ఉదయం ఆమె విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఇటువంటి పరిస్థితులలో బాధితులకు ఏం న్యాయం చేస్తారని ఆమె సీఎంను ప్రశ్నించారు. ఆయన తన పర్యటనలో ఏ ఒక్క హామీ ఇవ్వలేదని విమర్శించారు. పంటల బీమా పథకం నుంచి 25 శాతం తక్షణం బాధితులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. మూడు లక్షల పరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. ఏలేరు ఆధునికీకరణకు వైయస్ఆర్ రూ. 132 కోట్లు కేటాయించారని చెప్పారు. ఇంతవరకూ అది ఎందుకు పూర్తి కాలేదని నిలదీశారు. వైయస్ఆర్ లేకపోవడంతో ప్రతి పనీ నిలిచిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.