న్యాయం చేయండి మహా ప్రభో అని వేడుకున్న ఆరోగ్యమిత్రలపై టీడీపీ ఎంపీ శివప్రసాద్ అహంకారపూరితంగా వ్యవహరించారు. ఏళ్ల తరబడి సేవ చేసిన తమను ఉద్యోగాల నుంచి తొలగించడం అన్యాయమని...రోడ్డున పడేయొద్దని ఆరోగ్యమిత్ర ఎంప్లాయిస్ తమ ఆవేదనను తిరుపతిలో ఎంపీ ఎదుట మొరపెట్టుకున్నారు.<br/>అందుకు ఆయన ఆరోగ్యమిత్రలకు ఇచ్చిన సమాధానం ఎలా ఉందంటే. మీలా రోడ్లపై చాలామంది ఉన్నారు. ఏం కాదులే అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారు. చంద్రబాబు ఊళ్లో లేరు. ఆయన వచ్చాక చూద్దాంలే. ఎక్కడ పడితే అక్కడ నిలదీస్తారెందుకు అంటూ ఆడిపోసుకున్నారు. మీ వల్ల అవుతుందనుకుంటే పరిష్కరించుకోండి..ఇక్కడి నుంచి వెళ్లిపోండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. <br/>ఓటు వేసి గెలిపించిన పాపానికి ఇలాగేనా వ్యవహరించేది అంటూ ఆరోగ్యమిత్రలు కన్నీటి పర్యంతమయ్యారు. సమస్యను చెప్పుకుందామని వస్తే ఇలా అవమానిస్తారా అంటూ ఎంపీ తీరుపై మండిపడ్డారు.