వైఎస్ జగన్ ను కలిసిన విద్యార్థిసంఘం నేతలు

అనంతపురంః జిల్లాలో రైతు భరోసా యాత్ర పర్యటనలో ఉన్న వైఎస్ జగన్ ను విద్యార్థి సంఘం నేతలు కలిశారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్నారని  వారు జననేత వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఉద్యోగాలిస్తాం, ఉద్యోగాలు లేని వారికి నెలకు రూ. 2 వేలు భృతి ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని వాపోయారు. 

రాష్ట్రంలో లక్షన్నర పోస్ట్ లు ఖాళీలున్నా భర్తీ చేయడం లేదని విద్యార్థి నేతలు వైఎస్ జగన్ కు మొరపెట్టుకున్నారు. చంద్రబాబుకు బుద్ధి వచ్చేవిధంగా పోరాటం చేయాలన్నారు. వారి  సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన వైఎస్ జగన్...తప్పకుండా ప్రభుత్వంపై పోరాడుదామని హామీ ఇచ్చారు. 
Back to Top