కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
స్థానిక ఎన్నికలకు హైకోర్టు ఆదేశం
04 Sep 2012 3:14 AM
హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదిగో ....ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్న ప్రభుత్వానికి న్యాయస్థానం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని మంగళవారం ఆదేశించింది. మూడు నెలల్లోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ఏర్పాట్లు తక్షణమే చేయాలని సూచించింది. ఏడాదికి పైగా స్థానిక సంస్థలు ప్రత్యేకాధికారుల పాలనలోనే ఉన్నాయి. తాజా గణాంకాలు అందుబాటులో లేకున్నా సరే, 2001 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.