గృహ ప్రవేశానికి హాజరైన సిద్ధారెడ్డి

కదిరి టౌన్‌: పట్టణంలోని అడపాలవీధిలో సోమవారం భాస్కర్‌రెడ్డికి చెందిన నూతన గృహప్రవేశ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త డా.పీ.వీ.సిద్దారెడ్డి హాజరయ్యారు. ఎన్‌పీకుంట మండలంలోని గంగెద్దులవారిపల్లి చౌకడిపో డీలరు లక్ష్మినారాయణరెడ్డి కుమారుడు భాస్కర్‌రెడ్డిలను కలిసి గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డా.సిద్దారెడ్డితోపాటు పార్టీ పట్టణాధ్యక్షుడు కేఎస్‌ బహవుద్దీన్, సర్పంచ్‌ శివారెడ్డి, పుల్లారెడ్డి, మోహన్‌రెడ్డి, నాగమల్లు, మైనార్టీ నాయకులు అబుబకర్, అన్సర్‌వలి, సర్ఫరాజ్, బాబా, ఫాజిల్, ఎహసాన్, మహబూబ్‌బాషాలు పాల్గొన్నారు.

Back to Top