కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వరంగల్ లో ముగిసిన రెండో విడత పరామర్శయాత్ర..!
11 Sep 2015 4:04 PM
వరంగల్ః మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల రెండో దశ పరామర్శయాత్ర వరంగల్ జిల్లాలో ముగిసింది. షర్మిల పర్యటనకు అపూర్వ స్పందన వచ్చింది. షర్మిలను చూసేందుకు ప్రజలకు ఉత్సూహకత చూపారు. అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఐదు రోజుల్లో ఆరు నియోజకవర్గాల్లో పర్యటించిన షర్మిల...మొత్తం 30 కుటుంబాలను పరామర్శించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మృతిని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబసభ్యులకు భరోసా కల్పించేందుకు జిల్లాలో వైఎస్ షర్మిల పరామర్శయాత్ర చేపట్టారు. కుటుంబసభ్యులను ఆత్మీయంగా పలకరించి ధైర్యం చెప్పారు. ఈనెల 21,22 తేదీల్లో జిల్లాలో షర్మిల మూడవ విడత పరామర్శయాత్ర కొనసాగుతుందని వైఎస్సార్సీపీ నేత కొండా రాఘవరెడ్డి తెలిపారు. ఈనెల 23 నుంచి కరీంనగర్ జిల్లాలో పరామర్శయాత్ర మొదలవుతుందన్నారు.