'పార్వతీపురం'లో షర్మిల పాదయాత్ర

విజయనగరం 19 జూలై 2013:

వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్.జగన్మోహన్ రెడ్డి సోదరి శ్రీమతి వైయస్ షర్మిల మరోప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర  పార్వతీపురం నియోజకవర్గంలోని  లచ్చయ్యపేట నుంచి శుక్రవారం ఉదయం మొదలైంది. అంటిపేట, కాశీపేట, ఆర్.వెంకన్నపేట జంక్షన్, చినబోగిలి, సీతానగరం గ్రామాల్లో పాదయాత్ర చేసి మధ్యాహ్న భోజన విరామానికి ఆగుతారు. అనంతరం అప్పయ్యపేట, జోగింపేట, గుచ్చిమి, చినరాయుడుపేట, మరిపివలస, నర్శిపురం గ్రామాల్లో పాదయాత్ర చేపడతారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర శుక్రవారం 214వ రోజుకు చేరుకుంది.

Back to Top