మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
సర్కార్కు చిత్తశుద్ధి ఉందా?
25 Aug 2012 4:34 AM
హైదరాబాద్, 25 ఆగస్టు 2012 : ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్పై కేబినెట్ సబ్కమిటీ నివేదిక రావడం సంతోషమే అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అన్నారు. అయినా దానిని అమలు చేయడం, చట్టబద్దత కల్పించడంపైనే ప్రభుత్వం చిత్తశుద్ది ఆధారపడి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధుల వినియోగం విషయంలో ఎలాంటి సమస్యలూ ఎదురు కాకూడదనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్చకు, ప్రత్యేక బడ్జెట్ సమావేశానికి డిమాండ్ చేస్తోందని ఆయన అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్పై అధ్యయనానికి ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై సాక్షి చానల్ శనివారం నిర్వహించిన ప్రత్యేక చర్చలో జూపూడి పాల్గొన్నారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలు, వారి కష్టాలపై ప్రత్యేక బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేస్తామన్న ప్రతిపాదనను సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య స్వాగతించారు. ప్రభుత్వం తలచుకుంటే చట్టం చేయడంలో న్యాయపరమైన చిక్కులేవీ రాబోవన్నారు. అయితే సబ్కమిటీ నివేదిక పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నాటకం ఆడుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో నాయకుడు నల్లా సూర్యప్రకాశ్ అన్నారు.