మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
'సహకార ఎన్నికల్లో గెలుపే లక్ష్యం'
11 Jan 2013 11:38 AM
విజయవాడ:
త్వరలో జరగనున్న సహకార సంఘాల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పనిచేయాలని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ ఉదయభాను సూచించారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జిల్లా ముఖ్యనేతలతో పార్టీ కేంద్ర విధాన మండలి సభ్యులు ఎం.వి. మైసూరారెడ్డి, సోమయాజులు సహకార ఎన్నికలపై సమీక్షించారన్నారు. సహకార సంఘాల సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసిందని, కొత్త ఓటర్ల జాబితాను ఈ నెల 21న ఆయా సహకార సంఘాల్లో ప్రదర్శించనున్నారని తెలిపారు. ఆ తర్వాత పార్టీ బలాబలాలను పరిగణలోకి తీసుకుని వివాదరహితులైన అభ్యర్థులను రంగంలోకి దింపాలని పార్టీ యోచిస్తోందన్నారు. నగరంలో సమావేశం నిర్వహించి జిల్లాలోని 425 సహకార సంఘాల్లో అభ్యర్థుల గెలుపు కోసం చర్చించనున్నట్లు ఉదయభాను తెలిపారు.