కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం
సచివాలయానికి సీఎం కటౌట్ సోకులు
31 Aug 2012 6:29 AM
హైదరాబాద్, 31 ఆగస్టు 2012 : ఓ పద్ధతీ పాడూ లేని విద్యుత్ కోతలతో దిక్కుతోచక రాష్ట్ర ప్రజలు అల్లాడుతుంటే.. పాలకులకు కొత్తగా ప్రచారం పిచ్చి పట్టుకుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పైసా విదల్చని ప్రభుత్వం, సొంత ప్రచారం కోసం నిధుల్నీ నీళ్లలా ఖర్చు పెడుతోంది. 108 వాహనాలపై కిరణ్ బొమ్మల కోసం లక్షలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం.. తాజాగా, రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయాన్ని, కిరణ్ సర్కార్ ప్రచార వేదికగా చేసుకుంది. సెక్రటేరియట్ బ్లాకుల దగ్గర ముఖ్యమంత్రి కటౌట్లు, ఫోటోలు పెట్టి ప్రచార ఆర్భాటానికి తెర తీసింది.