బాబు మహిళల ఆగ్రహానికి బలైపోతారు

హైదరాబాద్ః శాసనసభను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లా వాడుకుంటూ చంద్రబాబు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. చంద్రబాబు మహిళా వ్యతిరేకి అని ధ్వజమెత్తారు. చంద్రబాబు మహిళలను అన్ని రకాలుగా మోసం చేస్తున్నారని ఫైరయ్యారు. 

చంద్రబాబుకు ఓటేసినందుకు రాష్ట్రంలోని మహిళలంతా చింతిస్తున్నారని చెప్పారు. మహిళల ఆగ్రహానికి బాబు బలైపోవడం ఖాయమన్నారు. విలువల గురించి బాబు మాట్లాడడం విడ్డూరమన్నారు. మహిళలను వేధించడం, ఓటుకు కోట్లు కుంభకోణంలో పట్టుబడడం, ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడమేనా బాబు నీకున్న విలువలని ఎధ్దేవా చేశారు. 
Back to Top