అనంతపురంః టీడీపీ సర్కార్ అరాచకాలకు ముగింపు పడే రోజులు దగ్గరపడ్డాయి. బాబు అవినీతి, అక్రమాలతో విసిగివేసారిన తెలుగుతమ్ముళ్లు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పోరాటాలకు ఆకర్షితులై వైయస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరు మండలం సింగంపల్లి గ్రామానికి చెందిన పలువురు టిడిపి నాయకులు రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి సమక్షంలో వైయస్సార్సీపీలో చేరారు. వీరందరికీ ప్రకాశ్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.