వైయస్‌ జగన్‌కు రాష్ట్రపతి‌ అపాయింట్‌మెంట్

హైదరాబాద్‌ :

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి గురువారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని క‌లుసుకుంటారు. ఉదయం 11.30 గంటలకు తనను కలిసేందుకు రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ‌లభించింది. శీతాకాల విడిదిలో భాగంగా సికింద్రాబాద్‌ సమీపంలోని బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో శ్రీ జగన్‌తో పాటు పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కలుసుకుంటుంది.

శ్రీ వైయస్ జగ‌న్ వెంట పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య‌ నాయకులు రాష్ట్రపతిని కలుసుకునేందుకు వెళతారు. రాష్ట్రాన్ని విభజించవద్దని, సమైక్యంగా ఉంచమని వారు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేస్తారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ శ్రీ నేతృత్వంలోని బృందం రాష్ట్రపతికి అఫిడవిట్లు కూడా అందజేస్తుంది.

Back to Top