దీక్షాస్థలికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు


ఢిల్లీ: ఆరు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న  వైయస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో దీక్షను భగ్నం చేసేందుకు ఢిల్లీ పోలీసులు దీక్షాస్థలికి చేరుకున్నారు. ఎంపీలను దీక్ష విరమించాలని వారు కోరుతున్నారు. అయితే ఎంపీలు ప్రాణాలు లెక్క చేయకుండా దీక్షను కొనసాగిస్తున్నారు. దీంతో దీక్షాస్థలిలో ఉద్రిక్తత నెలకొంది. ఎంపీ మిథున్‌రెడ్డి తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నారు. అవినాష్‌రెడ్డి షుగర్‌ లెవల్సు పడిపోతున్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
 
Back to Top