హోదాపై మాట్లాడినందుకే నోటీసులు

హైదరాబాద్ః ఏపీ ప్రివిలేజ్ కమిటీ సమావేశమైంది. వైయస్సార్సీపీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు కమిటీ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ఉద్దేశ్యపూర్వకంగానే తమకు నోటీసులిచ్చారని పేర్కొన్నారు. తాము ఏ తప్పు చేయలేదని అన్నారు. ప్రత్యేకహోదా గురించి మాట్లాడిన వారిపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలు మండిపడ్డారు.

Back to Top