బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
లక్షల టన్నులు అమ్ముకున్నాక ధాన్యం రేటు పెంచుతారా?
30 Mar 2018 11:32 AM
నెల్లూరు :
రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేలా చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి సోమిరెడ్డి విఫలమయ్యారని సర్వేపల్లి ఎంఎల్ ఎ కాకాణి గోవర్ధనరెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో ధాన్యపు కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అనంతరం ఆయన శుక్రవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ రైతులు దాదాపు 6 లక్షల టన్నుల బిపిటి ధాన్యాన్ని విక్రయించిన తరువాత ధాన్యపు ధర అంటూ మంత్రి ప్రకటన పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చర్య సిగ్గుచేటని విమర్శించారు. మిల్లర్ల దగ్గర ముడుపులు తీసుకుని రైతులకు కన్నీళ్లుపెట్టిస్తున్నారని మండిపడ్డారు. ధాన్యపు కొనుగోలు కేంద్రాల్లో కూడా రైతులకు ప్రభుత్వం ప్రకటించిన ప్రకటించిన ధరలు రాకపోవడం శోచనీయమని ఈ పరిస్థితికి మంత్రి అవినీతే కారణమన్నారు. రైతులను మిల్లర్లు దోచుకుంటుంటే, అధికార యంత్రాగం చోద్యం చూడటం గర్హనీయమన్నారు.