వినూత్నంగా నిరసన తెలిపిన క్రిష్ణా జిల్లా నాయకులు

విజయవాడ) ప్రత్యేక హోదా కోసం గళమెత్తిన వైయస్సార్సీపీ పిలుపు మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవాడలో
వినూత్న నిరసన తెలిపారు. వ్యాపారులు, ఉద్యోగులు స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొన్నారు.
మాజీ మంత్రి పార్థసారధి, పార్టీ అధికార ప్రతినిధి గౌతమ్ రెడ్డి, నగర అధ్యక్షులు
వంగవీటి రాధా తదితరులు నిరసన ప్రదర్శన చేశారు. వినూత్నంగా ప్రజలకు గులాబీ పువ్వులు
పంచి పెట్టారు. చంద్రబాబు మోసాలపై అంతా చైతన్యం కావాలని, ప్రత్యేక హోదాను పోరాటం
ద్వారా సాధించుకోవాలని పిలుపు ఇచ్చారు. 


Back to Top