హైదరాబాద్) తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ని తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల నిర్వహించనున్నారు. హైదరాబాద్లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం (లోటస్ పాండ్)లో ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు చెందిన పలువురు సీనియర్ నేతలు హాజరు కానున్నారు. అటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల జిల్లా కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో జయంతి కార్యక్రమాలు ఏర్పాటు అయ్యాయి. ఈ సందర్భంగా అనేకమంది స్వచ్చంద సేవా కార్యక్రమాలు చేపట్టారు.