మడకశిర ఎమ్మెల్యేగా వైయస్‌ఆర్‌సీపీ నేత తిప్పేస్వామి



అనంతపురం: మడకశిర ఎమ్మెల్యేగా వైయస్‌ఆర్‌సీపీ నేత తిప్పేస్వామి కొనసాగుతారని సుప్రీం కోర్టు స్పష్టీకరించింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే ఈరన్న ఎన్నికల చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి విధితమే. ఈ తీర్పుపై ఈరన్న సుప్రీం కోర్టుకు వెళ్లగా అక్కడ ఆయనకు చుక్కెదురైంది. ఈరన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. సుప్రీం కోర్టు తీర్పు పట్ల వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
 
Back to Top