లింగాయపాలెం రైతుల ఆందోళన

అమరావతిః సింగపూర్ కంపెనీలతో ప్రభుత్వం భూ ఒప్పందంపై లింగాయపాలెం రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి తాము భూములు ఇవ్వలేదన్నారు. సింగపూర్ కంపెనీలకు తమ భూములను ఎలా కట్టబెడతారని చంద్రబాబును నిలదీశారు. తక్షణమే సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమను తరిమేసేందుకు ప్రయత్నిస్తోందని రైతులు మండిపడ్డారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ లింగాయపాలెంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

Back to Top