కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
కార్మికులు, భూ నిర్వాసితుల విజ్ఞప్తులు
10 Dec 2015 12:24 PM
విశాఖపట్నం : జిల్లా పర్యటనలో భాగంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎలమంచిలి చేరుకున్నారు. జాతీయ రహదారిపై ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు.
అనంతరం వైఎస్ జగన్ను తుమ్మపాల కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బాధితులు కలిశారు. ఫ్యాక్టరీ ఆధునీకరించేలా చర్యలు తీసుకునేందుకు కృషి చేయాలని వైఎస్ జగన్ కు కార్మికులు విజ్ఞప్తి చేశారు. అలాగే తమ బకాయిలు తీర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. అందుకు వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు.
అలాగే వల్లూరు లాజిస్టిక్ హబ్ భూ నిర్వాసితులు కూడా వైఎస్ జగన్ను కలిశారు. తమకు నష్టపరిహారం చెల్లింపులో పక్షపాతం చూపుతున్నారంటూ వారు వైఎస్ జగన్ వద్ద ఆవేదన వక్తం చేశారు. ఈ అంశంలో అన్యాయం జరగకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని వైఎస్ జగన్ భూ నిర్వాసితులకు హామీ ఇచ్చారు.