రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ఖమ్మం జిల్లాలో నేడు విజయమ్మ పర్యటన
08 Nov 2012 9:18 AM
ఖమ్మం:
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆవేదనకు గురవుతున్న అన్నదాతలకు మనోధైర్యాన్ని కల్పించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారు. అయిదు నియోజకవర్గాలలో ఆమె వరదబాధిత ప్రాంతాలను ఆమె సందర్శిస్తారు. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం, ఖమ్మం నియోజకవర్గంలోని శివాయిగూడెం, వి.వెంకటాయపాలెం, వైరా నియోజకవర్గంలోని పల్లిపాడు, వైరా, సత్తుపల్లి నియోజకవర్గంలోని నారాయణపురం, అశ్వారావుపేట నియోజకవర్గంలోని చెలమప్పగూడెంలో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తారని పార్టీ జిల్లా కన్వీనర్ పువ్వాడ అజయ్కుమార్ వెల్లడించారు. మంగళ, బుధవారాలలో ఆమె తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే.