<strong>ఎవరు ముందు ఎవరు వెనక కన్నా</strong><strong>హోదా కోసం కేంద్రంపై వత్తిడే ముఖ్యం</strong><strong>అవిశ్వాసంపై గట్టిగా పట్టుబట్టండి</strong><strong> 25 మంది ఎంపిలు ఏక తాటిపైకి వస్తే ఫలితం </strong><strong>పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి</strong> <br/><br/><strong>సత్తెనపల్లి:</strong> ప్రత్యేక హోదా సాధనకు పార్లమెంటు వేదికగా కొనసాగుతున్న ఆందోళనలు, భవిష్యత్తు కార్యాచరణపై వైయస్ఆర్ సీపీ ఎంపిలకు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఏప్రిల్ 6 కన్నా ముందే నిరవధికంగా వాయిదా పడితే, ఆ రోజే లోకసభకు రాజీనామాలు చేయాలని జగన్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్లలో ప్రజాసంకల్పయాత్ర శిబిరంలో పార్టీ ఎంపీలతో సోమవారం ఉదయం వైయస్ జగన్ సమావేశమయ్యారు. దాదాపు గంటా 45 నిముషాల పాటు జరిగి న ఈ సమవేశంలో పలు అంశాలను చర్చించారు. రాజీనామాలన్నీ స్పీకర్ ఫార్మాట్లోనే ఇవ్వాలని సూచించారు. <strong>రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు ఒకేతాటిపైకి వచ్చి రాజీనామాచేస్తే. దాని తీవ్రత ఎక్కవ ఉంటుందనీ, కేంద్రంపై మరింత ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఇప్పటికైనా రాజీనామాల విషయంలో కలిసి రావాలని టీడీపీని కోరుతున్నామన్నారు. </strong> ముందుగా రాజీనామాలు ప్రకటిస్తే టీడీపీకూడా ఈ తరహా ప్రకటనలు అవకాశం ఉందని ఒకరిద్దరు ఎంపీలు అభిప్రాయం వ్యక్తంచేయగా, ప్రత్యేక హోదా సాధన పోరాటంలో బేషజాలకు పోవాల్సిన పనిలేదంటూ ఉద్బోధించారు . పార్టీ తరపున చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని, అంశాన్ని దాపరికంలేకుండా ప్రజలముందు ఉంచుతున్న విషయాన్ని గుర్తు చేశారు. రాజీనామాల ప్రకటన నుంచి అవిశ్వాసం వరకూ నిర్ణయాలన్నీ చిత్తశుద్ధితో తీసుకున్నామన్నారు. వాటిని నేరుగా ప్రజలముందే ఉంచుతున్నామని ఈ సందర్భంగా జగన్ అన్నారు. ప్రత్యేక హోదా సాధనకోసం కేంద్రంపై ఒత్తిడి, ఏపీకి పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలపై దేశవ్యాప్తంగా చర్చజరగాలన్నదే పార్టీ ప్రధాన ఉద్దేశమన్నారు. ఎంపిల రాజీనామాలు ప్రకటించినప్పుడు, అవిశ్వాసం పెడతానన్నప్పుడు కూడా చంద్రబాబు ముందుకురాలేదని, విధిలేని పరిస్థితుల్లో వారుకూడా అవిశ్వాసం పెట్టాల్సి వచ్చిందన్నారు. ఏది ఏమైనా రాష్ట్రానికి చెందిన 25 మంది ఎంపీలు ఒకే నిర్ణయంతో ముందుకు వస్తే . దానివల్ల వచ్చే ఒత్తిడి, తీవ్రత వేరేలా ఉంటుందన్నారు. <strong>ఎవరు ముందు, ఎవరు వెనక కన్నా.. ప్రత్యేక హోదాకోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడమే ముఖ్యమని వైయస్ జగన్ పేర్కొన్నా</strong>రు. అందుకే రాజీనామాల నిర్ణయం ప్రకటించినప్పుడు కలిసి రావాలని చంద్రబాబును అడిగామన్నారు. అవిశ్వాసం ముందు వారు పెట్టినా మద్దతు ఇస్తామన్నాం, లేదంటే.. మనం పెట్టే అవిశ్వాసానికి మద్దతు ఇవ్వాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. వైయస్ఆర్ సీపీ పోరాట ప్రణాళిక చాలా స్పష్టంగా ఉందని పేర్కొన్నారు. రాజీనామాల విషయంలో బేషజాలకు, ఎవరు ముందు, ఎవరు వెనుక అనే చర్చలోకి పోవాల్సిన అవసరంలేదని వైయస్ జగన్ ఎంపిలతో అన్నారు. అవిశ్వాసంపై గట్టిగా పట్టుబట్టాలనీ, అందర్నీ కలుపుకుని వెళ్లాలని సూచించారు.<br/><strong>పార్లమెంటులో పరిస్థితిని వివరించిన ఎంపిలు</strong><br/> ప్రత్యేక హోదాకోసం వైయస్సార్సీపీ పోరాడుతున్న తీరుపై పార్లమెంటులో వివిధ పార్టీల తీరును ఈ సందర్భంగా ఎంపిలు వైయస్ జగన్కు వివరించారు. వ్యక్తిగత సంభాషణల్లో టిడిపి ఎంపిలు తమతో ప్రస్తావించిన అంశాలను వారు జగన్ కు తెలిపారు. ఎత్తుగడలు, మీడియా మేనేజ్మెంట్లను నమ్ముకుని ఇరుకునపడ్డామన్న అభిప్రాయాన్ని టీడీపీ ఎంపీలు వెల్లడించారని వారు చెప్పారు. దేశంలోని పలు పార్టీల నాయకులు ప్రత్యేక హోదా కోసం మీ నాయకుడు చక్కటి పోరాటం చేస్తున్నారంటూ ప్రశసించిన విషయాన్ని వారు వివరించారు. పార్లమెంటులో ఆవరణలో ఎక్కడ చూసిన ప్రత్యేక హోదాపైనే చర్చ జరగుతోందని, పార్టీ చేస్తున్న పోరాటానికి ఇతర పార్టీల నుంచి చక్కటి మద్దతు వస్తోందని ఎంపిలు అన్నారు. ఈ సమావేశంలో ఎంపిలు మేకపాటి రాజమోహన్రెడ్డి, వరప్రసాద్, అవినాష్రెడ్డి, మిథున్రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.