వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పాదయాత్ర విజయవంతానికి ప్రత్యేక పూజలు
17 Oct 2012 6:31 AM
తిరుపతి, 17 అక్టోబర్ 2012: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కేంద్ర పాలక మండలి సభ్యుడు వై.వి. సుబ్బారెడ్డి బుధవారంనాడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాదయాత్ర చేయడం మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబం పేటెంట్ హక్కు అన్నారు. వైయస్ఆర్ గతంలో నిర్వహించిన ప్రజాప్రస్థానం పాదయాత్రను టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కాపీ కొట్టారన్నారు. ప్రజల కడగండ్లు తుడవడానికే షర్మిలమ్మ ఈ పాదయాత్ర చేస్తున్నారని ఆయన తెలిపారు. షర్మిలమ్మ పాదయాత్ర సజావుగా జరిగేలా ఆశీస్సులు అందించాలని కలియుగ ప్రత్యక్షదైవం, దేవదేవుడు శ్రీ వేంకటేశ్వరస్వామిని కోరుకోవడానికి తాను తిరుమల వచ్చానని సుబ్బారెడ్డి తెలిపారు.