హైదరాబాద్: జనం వెంట జగన్.. జగన్ వెంట జనం అన్న నానుడి ట్విటర్ లో రుజువైంది. రైతుల దుస్థితి మీద చలించిన జన నేత జగన్ మొదటి ట్వీట్ రైతు ఆత్మహత్యల మీద సంధించారు. దీనికి బాధ్యులు ఎవరు అంటూ ఆయన ఇచ్చిన ట్వీట్ కు విశేష స్పందన లభించింది. కొన్ని గంటల వ్యవధిలోనే అనేక వేల మంది స్పందన ను తెలియ చేశారు. గంట గంటకూ ఫాలోవర్స్ సంఖ్య, కామెంట్ల సంఖ్య విరివిగా పెరిగిపోతోంది.