కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ఇంకెంత కాలం జగన్ను జైల్లో పెడతారు
05 Sep 2012 12:10 AM
పులివెందుల: ‘కడప ఎంపీ వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి సంబంధించి 9, 10 నెలలుగా సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు.. మూడు నెలలుగా జైలులో పెట్టారు.. ఈరోజు 100వ రోజు.. ఆధారాలు చూపించకుండా ఎన్నిరోజులు పెడతారు.. ఏ తప్పు చేయకుండానే అన్యాయంగా జైలులో పెట్టారు’ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్ఆర్ కడప జిల్లా పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్రంలో అన్ని పార్టీలకంటే బలమైన పార్టీ.. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ఎదుర్కొంటామని స్పష్టంచేశారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకే కాదు అందరికీ భరోసా ఉండేదనీ.. ప్రస్తుతం ప్రభుత్వం సమస్యల వలయంలో చిక్కి అల్లాడుతోందనీ ఆమె చెప్పారు. మహానేత వైయస్ఆర్ కుల, మతాలకతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించారన్నారు. త్వరలోనే యువనేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ సువర్ణయుగం వస్తుందనీ, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయనీ విజయమ్మ తెలిపారు.