మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్సార్సీపీలో చేరిన చోడవరం టీడీపీ నేతలు
04 May 2017 6:42 PM
బుచ్చెయ్యపేట: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. పార్టీ అధినేత వైయస్ జగన్ పోరాటాలకు ఆకర్షితులవుతున్న వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు వైయస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకునేందుకు వరసలు కడుతున్నారు. విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చెయ్యపేట మండలం గొర్లెపాలెం గ్రామానికి చెందిన 270 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైయస్ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ సమక్షంలో పార్టీలో చేరారు. ధర్మశ్రీ వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ విధానాలు, ఎన్నికల వాగ్ధానాలు నెరవేర్చకపోవడంతో విసుగుచెంది ఆ పార్టీలో ఇమడలేక వైయస్సార్ సీపీలో చేరుతున్నామని వారు చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కుంచం ప్రకాషరావు,బోయిన నారాయణమూర్తి,డేగల అచ్చింనాయుడు,దాసరి అప్పలనాయుడు,వెలుగుల శ్రీనివాస్,ఇందలి సూర్యనారాయణ,అట్టా శ్రీను, రావి శ్రీను,ఇందలి చినబాబు తదితరులు పాల్గొన్నారు.