మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
పథకం ప్రకారమే ప్రతిపక్షంపై కేసులు
09 Dec 2015 12:07 PM
తిరుపతి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రభుత్వ నీచరాజకీయాలపై మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్ పెడుతున్న అక్రమ కేసులకు భయపడేది లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. పథకం ప్రకారమే ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలపై కేసులు పెడుతున్నారంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేణిగుంట విమానాశ్రయం ఘటనలో సీఎం చంద్రబాబు ఒత్తిడి వల్లే తమపై కేసులు పెట్టారని ఎమ్మెల్యే తెలిపారు. ఇటువంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామని, కోర్టులపై తమకు నమ్మకం ఉందని చెవిరెడ్డి స్పష్టం చేశారు.