రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
ఎమ్మెల్యే ‘ఆమంచి’పై చీటింగ్ కేసు
04 Feb 2017 2:51 PM
ప్రకాశం: చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తనను మోసగించారని, ఆయనపై చీటింగ్, అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బాధితుడు వేటపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వేటపాలెం మండలానికి చెందిన బాధితుడు సర్వేపల్లి సుబ్బయ్య వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల పార్లమెంటరీ ఇన్చార్జి అమృతపాణి సహకారంతో వేటపాలెం పోలీస్స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కార్పొషన్ ద్వారా బ్యాంకు రుణం కోసం సుబ్బయ్య 2014–15లో దరఖాస్తు చేసుకున్నాడు. వేటపాలెం ఎస్బీఐ అధికారులు కిరాణ షాపు కోసం రూ.2 లక్షల రుణాన్ని మంజూరు చేశారు. సరుకుల కొనుగోలుకు కొటేషన్ తీసుకురావాలని బ్యాంకు అధికారులు సూచించగా సాయం చేయమని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ను ఆశ్రయించాడు. దీంతో ఆయన చీరాలకు చెందిన వ్యాపారి చుండూరి శ్రీనివాసరావు ద్వారా కొటేషన్ ఇప్పించారు. అయితే సదరు చుండూరి శ్రీనివాసరావు సుబ్బయ్యకు డబ్బులు కానీ కిరాణా సరుకులు కానీ ఇవ్వకుండా తిప్పుతూ అవహేళనగా మాట్లాడారు. పలుమార్లు గట్టిగా ప్రశ్నించగా తన పర్సంటేజిని తీసుకుని మిగిలిన డబ్బును ఎమ్మెల్యేకు ఇచ్చానని చెప్పారు. డబ్బులు ఇవ్వాలని ఎమ్మెల్యేను ప్రాధేయపడగా ఆయన అకౌంట్ నుంచి రూ.50,000 తన అకౌంట్కు బదిలీ చేశారు. మిగతా డబ్బులు కూడా ఇస్తే కిరాణా వ్యాపారం పెట్టుకుని జీవిస్తామని ఎమ్మెల్యేకు అడగగా కులం పేరుతో బూతులు తిట్టి చంపేస్తానని బెదిరించాడు. ఎమ్మెల్యే నుంచి తనకు రావాల్సిన రూ.1,50,000 ఇప్పించాలని, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, వ్యాపారి చుండూరి శ్రీనివాసరావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సుబ్బయ్య పోలీసులను కోరాడు. వారి నుంచి తనకు ప్రాణాపాయం ఉందని బాధితుడు సుబ్బయ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.