హైదరాబాద్: అన్యాయమైపోయిందంటూ చంద్రబాబు డ్రామాలాడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కేంద్రంతో సఖ్యతగా ఉండాలని నాలుగేళ్ల పాటు నాటకాలు ఆడి, ఇప్పుడు ఏపీకి అన్యాయం జరిగిందని ముసలికన్నీరు కార్చాడం విడ్డూరంగా ఉందన్నారు. మీ అనుభవం, మీ స్నేహాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.