నవ దంపతులకు ఆశీస్సులు

గుంటూరు : వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె వివాహ వేడుకలకు హాజరయ్యారు.  గురువారం హాయ్‌లాండ్‌లో జరిగిన ముస్తఫా కుమార్తె వివాహానికి హాజరై నవ దంపతులకు ఆశీస్సులు అందించారు. 

అంతకు ముందు హైదరాబాద్‌ నుంచి విమానంలో గన్నవరం వచ్చిన వైయస్‌ జగన్‌ అక్కడ నుంచి రోడ్డు మార్గంలో హాయ్‌లాండ్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి హైదరాబాద్‌ బయల్దేరి వెళతారు.

Back to Top