గుంటూరు : వైయస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా కుమార్తె వివాహ వేడుకలకు హాజరయ్యారు. గురువారం హాయ్లాండ్లో జరిగిన ముస్తఫా కుమార్తె వివాహానికి హాజరై నవ దంపతులకు ఆశీస్సులు అందించారు. <br/>అంతకు ముందు హైదరాబాద్ నుంచి విమానంలో గన్నవరం వచ్చిన వైయస్ జగన్ అక్కడ నుంచి రోడ్డు మార్గంలో హాయ్లాండ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి హైదరాబాద్ బయల్దేరి వెళతారు.<br/>