కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
సీఎం మీడియా పిచ్చి వల్లే పుష్కరాల్లో తొక్కిసలాట
27 Mar 2017 9:49 AM
ఏపీ అసెంబ్లీ: సీఎం చంద్రబాబుకు ఉన్న మీడియా పిచ్చి కారణంగానే గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగిందని, సర్కార్ వైఫల్యం వల్లే 28 మంది ప్రాణాలు కోల్పొయారని ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ..గోదావరి పుష్కరాల్లో డాక్యుమెంటరీ చిత్రీకరణ కోసం ఒక గేటు మూయించారని, సీఎం మీడియా పిచ్చి వల్ల అనర్థం జరిగిందని ఆరోపించారు. షూటింగ్ చేయడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నారు. తొక్కిసలాటలో చనిపోయిన 28 కుటుంబాలకు ఇంతవరకు పరిహారం అందలేదని, బాధ్యులపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని జగ్గిరెడ్డి విమర్శించారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే పట్టుపట్టారు.