<strong>ఖమ్మం, 27 ఏప్రిల్ 2013:</strong> శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ఖమ్మంజిల్లాలోని బల్లెపల్లికి చేరుకుంది. ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వం, దానితో అంటకాగి, మద్దతుగా నిలుస్తున్న చంద్రబాబునాయుడి తీరుక నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల సుదీర్ఘ, చారిత్రక మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నారు. శ్రీమతి షర్మిలకు బల్లెపల్లిలో వైయస్ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అఖండ స్వాగతం పలికారు.