<strong>చిత్తూరు:</strong> సంఘమిత్ర సభ్యులకు చంద్రబాబు పాలనలో తీవ్ర అన్యాయం జరుగుతోందని, గ్రామాల్లో వెట్టిచాకిరి చేయించుకుంటోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ధ్వజమెత్తారు. ఈ నెల చివరి నాటికి జీఓ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నిరాహార దీక్ష చేస్తానని చెవిరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.