హైదరాబాద్: కరువు సమస్యపై మాట్లాడేందుకు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకపోవడంతో గందరగోళం రేగింది. ఈ సమస్యపై మాట్లాడేందుకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సభాపతి కోడెల శివప్రసాదరావు అనుమతివ్వలేదు. ఐదు నిమిషాల సమయం ఇవ్వాలని జగన్ కోరినా స్పీకర్ పట్టించుకోలేదు. దీంతో నిరసన తెలపడానికి కూడా సమయం ఇవ్వరా అంటూ జగన్ ప్రశ్నించారు.