<br/>అనంతపురం రైతుల గురించి చంద్రబాబు పట్టించుకోవటం లేదని మాజీ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి ఆరోపించారు. జిల్లాలో 66 మంది రైతులు ఆత్మహత్య చేసుకొంటే చీమ కుట్టినట్టయినా లేదని ఆయన అనంతపురంలో విమర్శించారు. ఈ జిల్లా నుంచి 4 లక్షల మంది వలస పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ పేరుతో చేసిన మోసానికి రైతులు వడ్డీ వ్యాపారుల చేతిలో నలిగిపోతున్నారని ఆయన అన్నారు.