27నుంచి విజయమ్మ జిల్లాల పర్యటన

హైదరాబాద్, 26 ఏప్రిల్ 2013:

ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లాలలో పర్యటించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నిర్ణయించారు. సమస్యలు తెలుసుకుని వాటిని ప్రభుత్వ దృష్టికి తేవాలన్న సంకల్పంతో ఆమె ఉన్నారు. శనివారం ఆమె రంగారెడ్డి జిల్లా చేవెళ్ళనుంచి పర్యటన ప్రారంభించనున్నారు. అధికార, విపక్షాలు ప్రజల సమస్యలను పెడచెవిన పెడుతున్న తరుణంలో ప్రజా పక్షంగా నిలవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుంచి జిల్లాల పర్యటన ప్రారంభమవుతుంది. ఉదయం 9.45 నిముషాలకు ఆమె నివాసం నుంచి బయలుదేరతారు. ఉదయం 11.45 కు చేవెళ్ళలో రచ్చబండలో ఆమె పాల్గొంటారు. సాయంత్రం నాలుగు గంటలకు వికారాబాద్ చౌరస్తాలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

Back to Top