100 చేనేత కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌



తూర్పు గోదావ‌రి:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌క‌టించిన న‌వ‌ర‌త్నాలు ప‌థ‌కాల‌కు ఆక‌ర్శితులై ప‌లువురు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా తూర్పు గోదావ‌రి జిల్లా తుని మండ‌లం డి.పోల‌వ‌రం గ్రామానికి చెందిన 100 చేనేత కుటుంబాలు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.  వారికి పార్టీ కండువాలు కప్పి ఆయన సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నేతన్నలను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎగిరేది వైయస్‌ఆర్‌సీపీ జెండానే అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.  చేనేత‌ల‌కు అన్ని విధాల అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.
Back to Top