పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు?
వైయస్ఆర్ సీపీ నేతపై టీడీపీ వర్గీయుల దాడి
21 Sep 2021 11:52 AM
కృష్ణా జిల్లా : ప్రాదేశిక ఎన్నికల్లో ఎంపీటీసీ సభ్యుడిగా గెలిచాడన్న అక్కసుతో వైయస్ఆర్ సీపీ నేతపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. కృష్ణా జిల్లా లింగారెడ్డిపాలెం ఎంపీటీసీ సెగ్మెంట్లో వైయస్ఆర్ సీపీ అభ్యర్థి దాసరి వెంకటేశ్వరరావు విజయం సాధించారు. ఈ సందర్భంగా పంచాయతీ శివారు గ్రామమైన చినగుడుమోటు వైయస్ఆర్ సీపీ నేతలు ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో బాణసంచా కాలుస్తూ సంతోషం వ్యక్తం చేశారు.
ఇది చూసి ఓర్వలేక అక్కడే ఉన్న ఒకే కుటుంబానికి చెందిన టీడీపీ వర్గీయులు నజీర్బాషా, షేక్ ఆదాం, నాగుల్మీరాబాషాలు వైయస్ఆర్ సీపీ నేత మగ్బుల్బాషాపై కర్రలతో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ మగ్బుల్బాషాను వెంటనే ఆస్పత్రికి తరలించగా.. ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం తీసుకెళ్లారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు