నెల్లూరు: వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ కుటుంబ సభ్యులను పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. ఇటీవల మేరిగ మురళీధర్ తండ్రి ఆనంద రావు మరణించడంతో గురువారం రాపూరులో ఎమ్మెల్సీ నివాసానికి వెళ్ళిన సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.