దక్షిణామూర్తి మృతికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం  

తాడేప‌ల్లి: ప్రముఖ రచయిత, వ్యాసకర్త డాక్టర్‌ పోరంకి దక్షిణామూర్తి (86) హైదరాబాద్‌ చైతన్యపురిలోని తన గృహంలో   కన్నుమూశారు. దక్షిణామూర్తి మృతి పట్ల సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సాహితీ లోకంలో తనదైన ముద్ర వేసిన దక్షిణామూర్తి ఎన్నో ప్రఖ్యాత అవార్డులు గెలుచుకున్నారని, ఆయన అనువదించిన ‘ఒక యోగి ఆత్మకథ’ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.  

Back to Top