విజయవాడ: దుర్గగుడి ఉత్సవాలపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. నవరత్నాలకు సంబంధించిన బ్రోచర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ నెల 29 నుంచి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభిస్తున్నామని చెప్పారు.భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఈవో సురేష్బాబు, కలెక్టర్ ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు.