27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులు
చంద్రబాబు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారు
30 Nov 2020 2:34 PM
మంత్రి పేర్ని నాని
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో చంద్రబాబు ప్రవర్తన వింతగా ఉందన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే రామానాయుడు మాట్లాడుతుండగా చంద్రబాబు అడ్డుకోవడం , తనకు మైక్ ఇవ్వాలని భైటాయించడం ఆయన అనుభవం ఏంటో అర్థం చేసుకోవచ్చు అన్నారు. చంద్రబాబు తన స్థాయి మరచి ఇవాళ పోడియం వద్ద మెట్లపై కూర్చోవడం, ఆయన సభ్యులు 17 మంది కూడా ఆయన మాట వినే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు తన స్థాయికి తగ్గట్టుగా హుందాగా వ్యవహరించాలని మంత్రి పేర్ని నాని సూచించారు. టీడీపీ సభ్యుల తీరు సరిగా లేదని 12 మంది ప్రతిపక్ష సభ్యులను ఒక్కరోజు పాటు సస్పెండ్ చేయాలని మంత్రి పేర్ని నాని స్పీకర్ను కోరారు.