చంద్రబాబు, లోకేష్‌ను విచారిస్తే లక్షల కోట్లు బయటకు వస్తాయి

మంత్రి కన్నబాబు
 

కాకినాడ:చంద్రబాబు, లోకేష్‌ను విచారిస్తే లక్షల కోట్లు బయటకు వస్తాయని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. చంద్రబాబు అవినీతి, రాష్ట్రానికి జరిగిన నష్టం ప్రజలకు తెలిసింది. చంద్రబాబు ఎంత దోచుకున్నారో ఐటీ సోదాల్లోనే తేలిపోయిందన్నారు. చంద్రబాబు అవినీతిపై ఈడీ విచారణ జరపాలని ఆయన కోరారు. ప్రతి రోజు మీడియాతో మాట్లాడే చంద్రబాబు ఇప్పుడెందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు.
 

Back to Top