వైద్యుల్లో మానవతా దృక్పథం లోపించింది

 ‌ డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి  ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఫిర్యాదు 
 

అనంతపురం: వైద్యుల్లో మానవతా దృక్పథం లోపించిందని ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి అన్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం ఆళ్ల నానికి  ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఫిర్యాదు చేశారు.ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినా కొందరు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించటం సరికాదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.  కరోనా బాధితుల పట్ల వైద్యుల చిన్నచూపు తగదని సూచించారు.  నాసిరకమైన భోజనం అందిస్తున్న ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటాం: ఆళ్ల నాని
 ఎమ్మెల్యే ఫిర్యాదుపై స్పందించిన వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని వైద్యం చేసేందుకు నిరాకరించే ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రైవేట్ ఆసుపత్రులను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. నాన్ కోవిడ్ రోగులకు వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు.  

 

Back to Top